Thursday, March 10, 2011

ఉస్మానియా యూనివర్శిటీలో మళ్లీ ఉద్రిక్తత

ఉస్మానియా యూనివర్శిటీలో గురువారం మరోసారి ఉద్రిక్త వాతావరణ నెలకొంది. జేఏసీ పిలుపు మేరకు మిలియస్‌మార్చ్‌లో పాల్గొనేందుకు ఉస్మానియా విద్యార్థులు బయల్దేరగా పోలీసులు అడ్డుకున్నారు. విద్యార్థులను అదుపు చేయడానికి యూనివర్శిటీ పరిసరాల్లో 3వేల మంది పోలీసులు మోహరించారు.
పోలీసులు తీరును నిరసనగా ఎన్‌సిసి గేట్‌ వద్ద విద్యార్థులు ఆందోళనకు దిగారు. శాంతి యుతంగా ఆందోళన కార్యక్రమానికి మబయల్దేరుతున్న తమను పోలీసులు అన్యాయంగా అడ్డుకున్నారంటూ విద్యార్థులు వాగ్విదానికి దిగారు. విద్యార్థులను అదుపు చేసేందుకు ఒక రౌండ్‌ టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారు. పరిస్థితి అదుపు తప్పితే.. విద్యార్థులపైకి రబ్బరు బల్లెట్లు, పొగ బాంబులు వేసేందుకు పోలీసులు సిద్దంగా ఉన్నారు.

No comments:

Post a Comment