Monday, April 25, 2011

మే 13న ప్రేక్షకుల ముందుకు "రాగిణి ఎంఎంఎస్"


బాలాజీ టెలీఫిలిమ్స్‌పై పలు విజయవంతమైన సీరియల్స్ నిర్మిస్తున్న ఏక్తాకపూర్ బాలాజీ మోషన్ పిక్చర్స్ పతాకంపై పలు బాలీవుడ్ చిత్రాలను అందించిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె నిర్మిస్తున్న రాగిణి ఎంఎంఎస్ చిత్రం బాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయ్యింది.

హిందీ, తెలుగు భాషల్లో ఏక కాలంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజ్ కుమార్ యాదవ్, కైనాజ్ మోతీవాలా ప్రధాన తారాగణంగా రూపొందుతున్న ఈ చిత్రానికి పవన్ క్రిప్లాని దర్శకత్వం వహిస్తున్నారు. నిజజీవితంలో ఓ ప్రేమ జంట ఎదుర్కొన్న సంఘటనను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇదొక రొమాంటిక్ థ్రిల్లర్. ఈ చిత్ర విశేషాలను గురించి చెపుతూ ఏక్తా... ముంబై, ఢిల్లీలో జరిగిన వాస్తవ సంఘటనలకు ప్రతిరూపం ఈ చిత్రం. ఎంఎంఎస్ స్కాండల్ నేపథ్యంలో కొనసాగే చిత్రమిది. ప్రతి సన్నివేశం ఎంతో సహజంగా ఉంటుంది. హిందీ, తెలుగు భాషలకు సంబంధించి ఏకకాలంలో షూటింగ్ చేస్తున్నాం. అలాగే విడుదలను కూడా మే 13న ఏకకాలంలో చేయడానికి ప్లాన్ చేస్తున్నాం.

యూనివర్సల్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది. ఆల్ట్ ఎంటర్ టైన్మెంట్ మరియు ఐరాక్ ఫిలిమ్స్ కూడా ఈ చిత్రానికి సహ నిర్మాణ సంస్థలుగా వ్యవహరిస్తున్నాయి అన్నారు.

No comments:

Post a Comment