Saturday, October 22, 2011

లండన్ మ్యూజియంలో కరీనా మైనపు బొమ్మ!!

kareena kapoor
రా.వన్ చిత్రం ద్వారా వెండి తెరపై మరోమారు కనిపించనున్న బాలీవుడ్ అందాలబొమ్మ కరీనా కపూర్ మైనపు బొమ్మను లండన్‌లోని బ్లాక్‌పూల్ తీరంలో ఉన్న ఒక మ్యూజియంలో ఏర్పాటు చేయనున్నారు............ ఇందుకోసం మేడమ్ టెస్సాడ్స్ మ్యూజియం అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసింది.

ఈ మైనపు బొమ్మను ఈనెల 27వ తేదీన ఆవిష్కరించనున్నారు. దీంతో పాటు మరో ఐదు మైనపు బొమ్మలను ప్రపంచంలోని ప్రధాన పట్టణాల్లో ఏర్పాటు చేసేందుకు మ్యూజియం సిద్ధమవుతున్నట్టు మ్యూజియం నిర్వాహకులు వెల్లడించారు.

'రా.వన్' సినిమా విడుదలను పురస్కరించుకొని లండన్‌లోని బ్లాక్‌పూల్ తీరంలో ఏర్పాటు చేస్తున్న ఎగ్జిబిషన్‌లో కరీనా మైనపు బొమ్మను ఆవిష్కరిస్తామని మ్యూజియం వర్గాలు తెలిపాయి.

ఇప్పటికే తన మైనపు బొమ్మకు సంబంధించిన చిత్రాలను మ్యూజియం నిర్వాహకులు మెయిల్‌ చేశారని, రా.వన్ ప్రీమియర్ షో తిలకించేందుకు తాను ఈనెల 25న లండన్‌కు వెళ్తున్నానని, అక్కడ నుంచి మ్యూజియంకు చేరుకుని బొమ్మను ఆవిష్కరిస్తానని కరీనా చెప్పుకొచ్చింది.

No comments:

Post a Comment