Monday, August 15, 2011

ఈనెల 26న "నాకూ ఓ లవరుంది" చిత్రం విడుదల

కృష్ణుడు హీరోగా మాస్టర్‌ హేమచంద్రారెడ్డి, బేబి హేమశ్రీ సమర్పణలో శ్రీ శివపార్వతి కంబైన్స్‌ బేనర్‌పై కె.రామ్‌వెంకీ దర్శకత్వంలో కె.సురేష్‌బాబు నిర్మిస్తున్న 'నాకూ ఓ లవరుంది' చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా నిర్మాత కె.సురేష్‌బాబు మాట్లాడుతూ ''అనుకున్న షెడ్యూల్‌లోనే షూటింగ్‌ పూర్తి చేసుకుని, పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ కూడా కంప్లీట్‌ చేసుకున్న మా 'నాకూ ఓ లవరుంది' ఫస్ట్‌కాపీ సిద్ధమవుతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈనెల 26న రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం.

ఇటీవల రిలీజ్‌ అయిన ఆడియోకు చాలా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఆనంద్‌, గోదావరి, చందమామ తరహాలో రాధాకృష్ణన్‌ చాలా అద్భుతమైన సంగీతాన్ని అందించారు. పాటలన్నీ చాలా బాగున్నాయని

రిపోర్ట్స్‌ వస్తున్నాయి. ఆడియోకు తగ్గట్టుగానే పాటలన్నీ ఎక్స్‌లెంట్‌గా పిక్చరైజ్‌ చెయ్యడం జరిగింది. ఔట్‌ అండ్‌ ఔట్‌ కామెడీతో రూపొందిన ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్‌ చేస్తుందన్న నమ్మకం నాకు వుంది.

కృష్ణుడు కెరీర్‌లో ఇదో మంచి చిత్రం నిలుస్తుంది. మా శ్రీశివపార్వతి కంబైన్స్‌ బేనర్‌లో మొదటి చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న 'నాకూ ఓ లవరుంది' పెద్ద హిట్‌ అయి అందరికీ మంచి పేరు తెస్తుంది'' అన్నారు.

దర్శకుడు కె.రామ్‌వెంకి మాట్లాడుతూ - ''ఎంటర్‌టైన్‌మెంట్‌ను కోరుకునే ఆడియన్స్‌ని ఆద్యంతం అలరించే విధంగా ఈ చిత్రం రూపొందింది. ఇప్పటివరకు వచ్చిన కృష్ణుడు సినిమాలకు పూర్తి భిన్నంగా ఈ చిత్రం వుంటుంది. తప్పకుండా అన్నివర్గాల ప్రేక్షకుల్ని మా 'నాకూ ఓలవరుంది' ఆకట్టుకుంటుందన్న నమ్మకం నాకు వుంది'' అన్నారు.

ఈ చిత్రంలో కృష్ణుడు, రితిక, ఎం.ఎస్‌.నారాయణ, సురేష్‌, ఆలీ, హేమ, ఉషశ్రీ, గీతాసింగ్‌, మాస్టర్‌ భరత్‌, మున్నా వేణు, శివన్నారాయణ, అనంత్‌, ధనరాజ్‌, ఖడ్గం పృథ్వీ, గుండు సుదర్శన్‌, తాగుబోతు రమేష్‌, రఘు కారుమంచి నటిస్తున్న ఈ చిత్రానికి కథ-మాటలు: రాఘవ టి., పాటలు: భాస్కరభట్ల, లక్ష్మీభూపాల్‌, పెద్దాడమూర్తి, సంగీతం: కె.ఎం.రాధాకృష్ణన్‌, ఎడిటింగ్‌: ఎం.ఆర్‌.వర్మ, ఆర్ట్‌: కృష్ణమాయ, కెమెరా: ఎస్‌.డి.జాన్‌, సమర్పణ: మాస్టర్‌ హేమచంద్రారెడ్డి, బేబి హేమశ్రీ, నిర్మాత: కె.సురేష్‌బాబు, స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: కె.రామ్‌ వెంకి.

No comments:

Post a Comment