శ్రీహరి
హీరోగా పీపుల్స్ థియేటర్ పతాకంపై బాబ్జీ దర్శకత్వంలో రూపొందుతోన్న
చిత్రం 'టీ..సమోసా. బిస్కెట్'... ఈ చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తయింది.
ప్రస్తుతం రెండవ షెడ్యూల్ ఈనెల 14నుంచి జరగనుంది. దీనికోసం ఈనెల ఆరంభంలోనే
సారథి స్టూడియోస్లో ఓ సెట్ వేస్తున్నారు.
హైదరాబాద్లోని కోఠి సెంటర్ నేపథ్యంలో సాగే కథ గనుక కోటిని తలపించే సెట్ను యుద్ధప్రాతిపదికపై తయారు చేస్తున్నారు. ఈసెట్ ఈనెల 12తో పూర్తవుతుందనీ, 14నుంచి షూటింగ్ జరుపుతామని దర్శక నిర్మాత బాబ్జీ తెలిపారు. కామెడీ, యాక్షన్తో సాగే ఈ చిత్రం కొత్తతరహాలో ప్రెజెంట్ చేస్తున్నామని ఆయన అన్నారు. శ్రీహరి సరసన హంసానందిని నటిస్తుండగా.. ఈ చిత్రానికి సంగీతాన్ని చక్రి అందిస్తున్నారు.
హైదరాబాద్లోని కోఠి సెంటర్ నేపథ్యంలో సాగే కథ గనుక కోటిని తలపించే సెట్ను యుద్ధప్రాతిపదికపై తయారు చేస్తున్నారు. ఈసెట్ ఈనెల 12తో పూర్తవుతుందనీ, 14నుంచి షూటింగ్ జరుపుతామని దర్శక నిర్మాత బాబ్జీ తెలిపారు. కామెడీ, యాక్షన్తో సాగే ఈ చిత్రం కొత్తతరహాలో ప్రెజెంట్ చేస్తున్నామని ఆయన అన్నారు. శ్రీహరి సరసన హంసానందిని నటిస్తుండగా.. ఈ చిత్రానికి సంగీతాన్ని చక్రి అందిస్తున్నారు.
No comments:
Post a Comment