Friday, November 18, 2011

మహేష్ బాబుతో చిత్రం: క్రిష్‌కు అగ్నిపరీక్షే..!

Mahesh Babu
మహేష్‌బాబు కథానాయకుడిగా 'వేదం' దర్శకుడు జాగర్లమూడి రాధాకృష్ణ ఉరఫ్‌ క్రిష్‌ ఓ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణసంస్థ నిర్మిస్తోంది....................... క్లాస్‌, మాస్‌ అంశాలతో రూపొందే ఈ చిత్రకథ అందరినీ అలరించే విధంగా కసరత్తు చేస్తున్నారు. కాగా, ఈ చిత్రంలో మహేష్‌ సరన నటించేందుకు ముగ్గురు హీరోయిన్లు కావాల్సి ఉంది. కథకు అనుగుణంగా హీరోయిన్ల ఎంపిక ఉంటుందనీ, ఎవరూ ఐటం సాంగ్‌ చేయరనీ క్రిష్‌ చెబుతున్నారు.

అంతలా కథలో మిళితమైన ఆ పాత్రల్ని ఎంపిక చేయడం క్రిష్‌కు ఒక అగ్నిపరీక్షలా తయారైంది. ఈ విషయమై మాట్లాడుతూ.. సినిమా టైటిల్‌ కంటే హీరోయిన్ల వేట చాలా కష్టమైందని సన్నిహితులతో చెప్పినట్లు తెలిసింది.

No comments:

Post a Comment